అమరావతిముచ్చట్లు:
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కీలక హెచ్చరిక జారీ చేసింది.
రానున్న వారాల్లో సూపర్ ఎల్ నినో మరింత బలపడనుండగా, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
భారత్లో ప్రభావంఈ రుతుపవన సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం.
మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య ప్రాంతాల్లో తేమ కొరత, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా అస్సాంలో భారీ వర్షాలు, వరదల ముప్పు కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి..!
ఐరోపా ఇప్పటికే తీవ్ర ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులతో అల్లాడుతోంది.
ఫ్రాన్స్లో అత్యవసర పరిస్థితి ప్రకటించగా, లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 40°Cకి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడవి మంటలు, కరువు పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి.
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తూ… “ఎల్ నినో మన గుమ్మం వద్ద కాదు… మన ఇంట్లోకి వచ్చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని వ్యాఖ్యానించారు.
Tags: Super El Niño Alert: Intensifying in August and September!!