చిన్నమండెం ముచ్చట్లు:
చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలో కలిబండ పెద్ద చెరువు మరమ్మత్తు పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ ప్రారంభించారు. చెరువుల అభివృద్ధితో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
Tags: Harithamma initiates repair works on the Kalibanda Pedda Cheruvu (Big Tank).