తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పంట కొనకపోవడంతో గోడ కూలి మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మే 6న మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలంలో పంటలను కాపాడుకునేందుకు వెళ్లి మృతి చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఈ సహాయాన్ని మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన రైతు సదస్సులో కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ రంగపేటలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేశారు.
Tags: KTR has a meal at a BRS activist’s house… Video