July 18, 2026
Explore
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు నమోదు

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు నమోదు

July 18, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో శనివారం కరోనా కేసు నమోదైంది. 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక జ్వరంతో ఆసుపత్రికి రాగా ఆమెకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో బాలికకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రి వైద్యులు వెంటనే బాధిత బాలికను కోవిడ్ వార్డుకు తరలించారు.

Tags: COVID-19 case reported at the new government hospital in Vijayawada.