July 18, 2026
Explore
రూ.7,500 కడితే రూ.లక్ష అంటూ RBI లేఖ వైరల్‌.. క్లారిటీ!

రూ.7,500 కడితే రూ.లక్ష అంటూ RBI లేఖ వైరల్‌.. క్లారిటీ!

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ లేఖలపై కేంద్ర ప్రభుత్వ ‘పీఐబీ ఫ్యాక్ట్‌చెక్’ విభాగం ప్రజలను అప్రమత్తం చేసింది.

రూ.7,500 రీఫండబుల్ టాక్స్ కడితే ఆర్‌బీఐ రూ.లక్ష విడుదల చేస్తుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వ లోగోలతో వచ్చే ఇలాంటి నకిలీ లేఖలను నమ్మి ఎవరికీ డబ్బులు పంపవద్దని, ప్రాసెసింగ్ ఫీజులు లేదా పన్నుల పేరుతో నగదు ఇస్తామని ఆర్‌బీఐ ఎప్పుడూ ప్రకటించదని తెలిపింది.

సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్లలోనే సరిచూసుకోవాలని సూచించింది.

Tags; RBI letter promising ₹1 lakh in exchange for a ₹7,500 payment goes viral – Here’s the clarification!