శ్రీసిటీ ముచ్చట్లు:
విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి..
రాష్ట్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శ్రీసిటీకి చేరుకున్నారు.ఆయన పర్యటన సందర్భంగా స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు.
శ్రీహరికోటకు పయనం..
శ్రీసిటీలో పర్యటన ముగించుకున్న అనంతరం,మంత్రి నారా లోకేష్ రోడ్డు మార్గం ద్వారా శ్రీహరికోటకు బయలుదేరారు.
చారిత్రాత్మకప్రయోగానికి సాక్షిగా..నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం కావడం విశేషం. అంతరిక్ష రంగంలో భారత ప్రైవేట్ సంస్థల ప్రస్థానానికి ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలవనుంది.ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అంతరిక్ష సాంకేతికతను ప్రోత్సహించడంలో భాగంగా ఆయన ఈ ప్రయోగంను వీక్షించనున్నారు.
Tags: Minister Nara Lokesh has arrived at Sri City.