బంగారుపాళ్యం ముచ్చట్లు:
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల పరిధిలో రాత్రిపూట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. నేషనల్ హైవే కారిడార్ ఆధ్వర్యంలో మొగిలి ఘాట్ నుంచి మొగిలి దేవాలయం వరకు సుమారు 1000 స్టడ్ లైట్ బ్లింకర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించి ప్రమాదాలు నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
Tags: Putting a stop to accidents at Mogili Ghat!