పంజాబ్ముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) దేశంలోని రెండో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు. ఈ అత్యాధునిక స్లీపర్ రైలు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని ఛెహర్తా వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది. సుదూర ప్రయాణాలను మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో భారతీయ రైల్వే ప్రవేశపెడుతున్న ఈ రైలు ఆధునిక సదుపాయాలు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది.
Tags: Prime Minister to launch the second Vande Bharat sleeper train today.