ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి చట్టం తీసుకొచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం
తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో తమ కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్’ ను తీసుకురానుంది. ఈచట్టం ప్రకారం, తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతం నుండి 15% లేదా రూ. 10,000 నేరుగా కట్చేసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు. నేడు జరిగే కేబినెట్ భేటీలో ఈబిల్లుకు ఆమోదం తెలిపి, త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Tags: In Telangana, if government employees neglect their parents henceforth, their salaries will be cut!