March 21, 2026
Explore
తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం

తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం

March 21, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

నాడు ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల మంది ఆకలిని తీర్చుతోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఈ ట్రస్టుకు తన మనుమడు దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారు. ఒక్కరోజు అన్నదానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని సీఎం కుటుంబం అందజేసింది. దేవాన్ష్ పేరుతో అన్నదానం కోసం ఇప్పటి వరకు 12 సార్లు విరాళం అందించారు.

Tags: Chandrababu’s family has donated to the Tirumala Annadanam Trust 12 times.