తిరుమల ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆసుపత్రుల్లో ‘శ్రీవారి వైద్యసేవ’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో..,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
సూపర్స్పెషాలిటీ వైద్యులు మూడు రోజులు, ఎంబీబీఎస్ వైద్యులు ఏడు రోజులు సేవలు అందించే అవకాశం ఉంటుంది.
వీరికి తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు.
హిందూ మతానికి చెందిన వైద్యులు TTD వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకుని పాల్గొనవచ్చు.
Tags;’Srivari Vaidya Seva’ launched on a pilot basis at TTD.