అమరావతిముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో నుండి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించాలని కూటమి పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, SIRపై ప్రత్యేక దృష్టి సారించి, ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని, రెండేళ్ల ప్రభుత్వ పాలనలో చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
Tags:Allocation of Rajya Sabha Seats: 3 for TDP, 1 for JSP!