రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం మండల పరిధిలోని కుదురుచీమనపల్లిలో గల ఓ ఎరువుల దుకాణంలో విజిలెన్స్ శాఖ అధికారులు లక్ష్మణ్ కుమార్, రామయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దుకాణంలోని స్టాక్ రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి లెక్కలు లేకుండా నిల్వ ఉంచిన 6.85 మెట్రిక్ టన్నుల ఎరువులను అధికారులు గుర్తించారు. సుమారు రూ.2.65 లక్షల విలువైన ఈ ఎరువుల నిల్వలను అధికారులు జప్తు (సీజ్) చేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) జాఫర్ పాల్గొన్నారు.
Tags:Massive fertilizer seizure in Ramasamudram