గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలం బురుజుపల్లికి చెందిన బాలుడు చంద్రగిరి గణేష్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరసింహారెడ్డి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో బాలుడు తిరుమలకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం 24 గంటల్లోనే బాలుడి ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన గాలివీడు పోలీసులు, ఎస్ఐ నరసింహారెడ్డి పనితీరును స్థానికులు అభినందించారు.
Tags: Galiveedu police trace missing boy within 24 hours.