పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్సిపి రాష్ట్ర పిలుపు మేరకు గురువారం ప్రతి మండల కేంద్రంలోను నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో క్యాడర్ను ఆదేశించారు. ప్రతి మండల కేంద్రంలోను ఆప్రాంత నాయకులు, పార్టీ కార్యకర్తలు కలసి కూటమి ప్రభుత్వం సూపర్-6, బాండ్లు, మ్యానిఫెస్టోను తగులబెట్టి నిరసన తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు , మాజీలు , పార్టీ నాయకులు, అనుబంధ సంస్థల ప్రతినిదులు కలసి పార్టీ కార్యకర్తలతో నిర్వహించాలని పేర్కొన్నారు.
Tags; YSRCP Protest on the 4th