పుంగనూరుముచ్చట్లు:
దోమల నివారణతో మలేరియా వ్యాధిని నివారించేందుకు వీలుందని మదనపల్లె డివిజన్ మలేరియా అధికారి గంగయ్య తెలిపారు. మంగళవారం మలేరియా మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నెల రోజుల పాటు జరిగే అవగాహన కార్యక్రమాలకు ప్రజలు తప్పక హాజరై మలేరియా నివారణకు కృషి చేయాలని కోరారు.
Tags: Malaria must be prevented.