పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయాన్ని గత నెలలో దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఈ ఆలయంలో దిష్టి తొలగింపుకు విక్రయించే కంకణాలు, అమావాస్య గుమ్మడికాయలు, నిమ్మకాయలు, దిష్టి టెంకాయలు విక్రయించే హక్కును వేలం వేస్తున్నట్లు దేవాదాయశాఖ ఒక ప్రకనటలో పేర్కొంది. జూన్నెల 5వ తేదీన వేలం వేయనున్నట్లు తెలిపారు. నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి, వేలంపాటలో పాల్గొనాలని అధికారులు కోరారు.
Tags: Auction of Sri Virupakshi Maremma Temple Articles on the 5th