పుంగనూరుముచ్చట్లు:
దోమల నివారణతో మలేరియా వ్యాధిని నివారించేందుకు వీలుందని అర్భన్ పిహెచ్సి డాక్టర్ రామకృష్ణ అన్నారు. సోమవారం మలేరియా మాసోత్సవాలలో భాగంగా కొత్తపేట, మేలుపట్ల ప్రాంతాలలో పిహెచ్సి సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. నెల రోజుల పాటు జరిగే అవగాహన కార్యక్రమాలకు ప్రజలు తప్పక హాజరై మలేరియా నివారణకు కృషి చేయాలని కోరారు.
Tags; Malaria must be prevented.