కాళేశ్వరం ముచ్చట్లు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. చివరి రోజైన సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, ఎండల నుంచి రక్షణ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
Tags; The Saraswati Antya Pushkarams are set to conclude tomorrow.