న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ (TET) పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గత ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు వేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కొట్టేసింది. అయితే, ఐదేళ్లకుపైగా సర్వీస్ ఉన్న టీచర్లకు టెట్ అర్హత గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు (2028 ఆగస్టు 31 వరకు) పొడిగించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్యా ప్రమాణాల కోసమే ఈ నిర్ణయమని కోర్టు పేర్కొంది.
Tags: All Government Teachers Must Pass TET: Supreme Court