హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ నుండి విజయవాడకు పోతున్న సితార ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఇబ్రహీంపట్నంలోని కూలింగ్ కెనాల్ డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు మితిమీరిన వేగంతో వచ్చి డివైడర్పైకి ఎగబాకి సగానికి పైగా గాల్లో వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. భయంతో భయాందోళనలకు గురై కేకలు వేసారు. టైం బాగుండి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు .ఇబ్రహీంపట్నం పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా జాగ్రత్తగా దించారు.
Tags: It is scary just to board a private bus.