శ్రీలంక ముచ్చట్లు:
భారతీయులకు శ్రీలంక ప్రభుత్వం సరికొత్త ఊరటనిచ్చింది. భారత్తో సహా 40 దేశాల పౌరులకు ఉచిత ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) విధానాన్ని ఇవాళ అమలులోకి తెచ్చింది. దీనివల్ల ఎలాంటి వీసా రుసుము చెల్లించకుండా, ఆన్లైన్లో ‘ETA’ దరఖాస్తు చేసుకుని 30 రోజుల పాటు శ్రీలంకలో పర్యటించవచ్చు.దేశంలో పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించడంతో పాటు, విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ క్యూల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు లంక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Tags: Visit Sri Lanka Without a Visa!