అమరావతిముచ్చట్లు:
ఆదివారం , సోమవారం రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల కోళ్లు మృతి…
పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండలకుతోడు వేడిగాలులతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు ఫౌల్ట్రీ ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
ఒక్క పచ్చిమ గోదావరి జిల్లా లోనే 3 లక్షల కోళ్లు చనిపోయినట్టు చెపుతున్నారు.
ఉన్నట్లుండి కుప్పకూలిపోయి చనిపోతుండటంతో పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది.
Tags: The intensity of the heat in Andhra Pradesh is increasing day by day.