అనంతపురం ముచ్చట్లు:
గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.
హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా ఒక్కసారిగా టైరు పగిలి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో బస్సులోని 24 మంది ప్రయాణికులలో సుమారు 13 మందికి గాయాలయ్యాయి.
మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Tags; Private Travel Bus Overturns in AP; 13 Injured