రాజంపేట ముచ్చట్లు:
ఈనెల 27, 28 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజంపేట నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు. సోమవారం రాజంపేటలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకులు భీమినేని చిట్టిబాబుతో కలిసి ఆయన పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానాడు నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జ్లు, నాయకులు పాల్గొన్నారు.
Tags: Make the Virtual Mahanadu a Success: Chamarti