తిరుమల ముచ్చట్లు:
సామాన్య భక్తులకు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయం ఉండే శుక్రవారం (మే 22) నాడే తొలిసారిగా 94,758 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం లైన్లను కొనసాగించడం, ఐసీసీసీ సాంకేతికతతో భక్తుల రద్దీని పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైంది. మే నెలలో భక్తుల సంఖ్య 90 వేలు దాటడం ఇది నాలుగోసారి.
Tags: A Brand New Record in the History of Tirumala