May 24, 2026
Explore
బాణసంచా పేలుళ్లతో జనం హడల్‌

బాణసంచా పేలుళ్లతో జనం హడల్‌

May 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో పుట్టినరోజులు, ఐపిఎల్‌ మ్యాచ్‌ల సంబరాలలో అర్ధరాత్రి బాణసంచా పేలుళ్లతో పట్టణంలోని వృద్ధులు, రోగులు, చిన్నపిల్లలు హడలిపోతున్నారు. ఈ విషయమై ఆదివారం మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఆర్‌.అశోక్‌ విలేకరులతో మాట్లాడుతూ సంబరాలు హద్దులు దాటుతోందని , అర్ధరాత్రి బాణసంచాలు, నాటుబాంబులు , షాట్‌లు పెట్టడంతో నిరంతరం పట్టణంలో భయంకరమైన శబ్ధం వస్తోందన్నారు. దీనిపై యువత తక్షణం ఇలాంటివి మానుకోవాలని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags; People Terrified by Firecracker Explosions