తిరుపతి ముచ్చట్లు:
- కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు సాధారణ బదిలీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ
- ప్రతి ఒక్కరి అభిప్రాయానికి ప్రాధాన్యం – కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు.
- సిబ్బంది సంక్షేమమే శాఖ బలం – జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ,
- ఎలాంటి సిఫార్సులు, ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శక బదిలీలు.
- పోలీస్ సిబ్బందిలో ఆనందం – జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు.
- నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం.
- పోలీస్ కుటుంబానికి భరోసానిచ్చిన తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఈరోజు ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి వరకు సాధారణ బదిలీల కౌన్సిలింగ్ను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బంది ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతి ఒక్క సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలు, కుటుంబ పరిస్థితులు, పని అనుభవం, ఆప్షన్లు తెలుసుకుని పూర్తిస్థాయి పారదర్శకతతో బదిలీలు నిర్వహించారు. ఎలాంటి ఒత్తిళ్లు, సిఫార్సులు, పక్షపాతం లేకుండా న్యాయంగా బదిలీలు చేపట్టడంతో పోలీస్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ…పోలీస్ శాఖ బలోపేతానికి సిబ్బంది సంతృప్తి చాలా ముఖ్యం, విధుల్లో నిబద్ధతతో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. పారదర్శకత, క్రమశిక్షణ, పనితీరుకే ప్రాధాన్యం ఇస్తాంమని
సిబ్బంది సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదనన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ముందుగా పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం, నమ్మకం పెరగాలి. అందుకే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ బదిలీలు నిర్వహిస్తున్నాంమని తెలిపారు.
అంతేకాకుండా, కొత్తగా బదిలీ అయిన స్థానాల్లో కూడా ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని, శాఖ ప్రతిష్టను పెంచేలా కర్తవ్య నిర్వహణ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు వెంకట్రావు (పరిపాలన) శ్రీనివాస్ (క్రైమ్స్) శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్( గీతా కుమారి (ఎస్ బి) ఏవో సురేష్ బాబు వారు పాల్గొన్నారు.
Tags: Top Priority to Transparency – Fair Transfers for Police Personnel