పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పులి నరేంద్ర కుమార్ రెడ్డి ని పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ మరియు పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.మదనపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మదన్ బాబు ఆధ్వర్యంలో నరేంద్ర కుమార్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:BJP leaders felicitated Narendra Kumar Reddy.