March 15, 2026
Explore
ఏపీలో సోమవారం నుండి ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

ఏపీలో సోమవారం నుండి ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

March 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.

Tags: Single-session schools in AP starting Monday; classes begin at 7:45 AM.