September 10, 2026
Explore
బుల్లెట్ రైలు ఢీకొని కేరళ మ‌హిళ మృతి

బుల్లెట్ రైలు ఢీకొని కేరళ మ‌హిళ మృతి

September 10, 2026 | Andhra Pradesh

కేరళం (క‌న్నూరు) ముచ్చట్లు:

జపాన్‌లో న‌ర్సింగ్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్న 22 ఏళ్ల కేర‌ళ యువ‌తి వీ.దేవిక బుల్లెట్ రైలు ఢీకొని మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఆమె ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది. జ‌పాన్ వెళ్లేందుకు డ‌బ్బు లేక‌, కూతురి మృత‌దేహాన్ని తీసుకురాలేక‌.. ఆమె పేరెంట్స్ అంతిమ వీడ్కోలు ప‌ల‌క‌లేక‌పోతున్నారు

అయితే జ‌పాన్‌లో ఉన్న కేర‌ళ సంఘం నిహ‌న్ కైరేలీ .. దేవిక అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ద‌హ‌న‌సంస్కారాల‌ను హిందూ సంప్ర‌దాయ ప్ర‌కారం నిర్వ‌హించనున్నారు. అయితే లైవ్‌స్ట్రీమింగ్ ద్వారానే పేరెంట్స్ త‌మ కూతురుకి తుది వీడ్కోలు ప‌ల‌క‌నున్నారు.

Tags: Kerala woman dies after being hit by bullet train.