నందలూరు ముచ్చట్లు:
నందలూరు మండలంలోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని గురువారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నిత్యానంద రెడ్డి, కొండయ్య, గుండు మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: MLA Akepati in the service of Sri Saumyanatha