వైసీపీ నుంచి టీడీపీలోకి ఇంకా వస్తారు:
అమరావతిముచ్చట్లు:
వైసీపీ సీనియర్ నేత బొత్స మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిక
వైసీపీ నుంచి ఇంకా చాలామంది టీడీపీలోకి వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుమార్తెతో సహా పార్టీలో చేరిక
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడి
చిన్న శ్రీను వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో వలసలపై కొత్త చర్చ
మంగళవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరి సహస్ర టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బేబినాయన, అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు వంటి పలువురు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగుపెడుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విజయనగరం జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టే వారి ప్రయత్నంలో నేను కూడా భాగస్వామిని కావాలనుకుంటున్నాను. ఈ అభివృద్ధి యజ్ఞంలో పాలుపంచుకోవాలనే తపనతోనే టీడీపీలో చేరాను” అని వివరించారు.
Tags: Chinna Srinu’s comments after joining the TDP.