అమరావతిముచ్చట్లు:
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రివర్గ విస్తరణపై హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రుల వద్ద అదనపు బాధ్యతలు, పనితీరు ఆధారంగా కొందరిని తప్పించి, మరికొందరిని చేర్చే యోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్, తృణమూల్, శివసేన, ఆప్ నుంచి వచ్చిన ఎంపీలకు చోటు దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ విస్తరణ ఉంటుందని అంటున్నారు.
Tags: Intense speculation regarding the Union Cabinet expansion—who will the new ministers be?