హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
రాత్రి విధుల్లో ఉన్న స్వామి..
ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో వాష్రూమ్కి వెళ్లి..
అక్కడే రివాల్వర్తో కాల్చుకున్నట్టు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య, పిల్లల్ని ఏమీ అనొద్దు.
వాళ్లు మంచి వాళ్లు. చనిపోయిన తర్వాత దెయ్యం అయినా సరే.. వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా” అని స్వామి తన డైరీలో రాసుకున్న నోట్ను పోలీసులు గుర్తించారు.
Tags; Swamy, a constable, committed suicide by shooting himself with his service revolver.