పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని కుమ్మరగుంటకు చెందిన రచన ట్రిపుల్ ఐటిలో సీటు సాధించడంపై గిరిజన సంఘ నాయకులు వేణునాయక్, శ్రీనివాసులునాయక్, రామయ్యనాయక్ ఆధ్వర్యంలో బుధవారం రచన ను సన్మానించారు. గిరిజన కులంలో జన్మించిన రచన తల్లిదండ్రులు, సురేంద్ర, జ్యోతి రైతు కూలీలని , అలాంటి వారి ఇంట సరస్వతి కటాక్షం జరిగిందని కొనియాడారు. గిరిజన విద్యార్థులు రచన ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
Tags: Tribal student felicitated