అమరావతిముచ్చట్లు:
- పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వచ్చే వారం – పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన
- ధరల సంక్షోభంతో రైతులు తల్లడిల్లుతున్న జిల్లాల్లో రైతులకు మద్దతుగా వైయస్సార్సీపీ ఆందోళనలు.
- గత ఏడాది ప్రకాశం జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో, ఈసారి గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో పర్యటిస్తా:
- అక్కడి పొగాకు రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేపడతాను:.
- ఈ పర్యటన తర్వాత కూడా ప్రభుత్వంలో చలనం రాకపోతే, కొద్దిరోజుల వ్యవధిలో కందుకూరులో మరో పర్యటన:
- పొగాకు రైతుల సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం స్పందించే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తారు.
- ఏ జిల్లాలో, ఏ పంట రైతులు ఇబ్బందులు పడుతున్నా వైయస్సార్సీపీ వారికి అండగా నిలుస్తుంది.
- నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడం సులభం. కానీ నిద్ర నటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని లేపాలంటే మరింత గట్టిగా ఒత్తిడి తీసుకురావాల్సిందే.
- రైతులకు శాశ్వతంగా మంచి జరగాలంటే ప్రజా ప్రభుత్వం రావాల్సిందే:
- కాని అప్పటివరకు రైతుల సమస్యలను వదిలిపెట్టకుండా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తాం.
- పొగాకు వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా, పండిన పంటలో కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు చేశారు.
- రాష్ట్రంలో సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు పండితే, ఇప్పటివరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు.
- సాధారణంగా 100 రోజుల్లో పూర్తికావాల్సిన కొనుగోలు ప్రక్రియలో 94 రోజులు గడిచినా ఐదో వంతు పంట కూడా కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
- సెప్టెంబరులో కర్ణాటకలో వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన పంటను ఎవరు కొంటారనే భయాందోళన రైతుల్లో నెలకొంది.
- పొగాకు ధర రూ.200కు తగ్గకూడదని చంద్రబాబు సమీక్షలో చెప్పిన మరుసటి రోజే మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి.
- పొదిలిలో రూ.179, టంగుటూరులో రూ.184, కనిగిరిలో రూ.184, కందుకూరులో రూ.186, జంగారెడ్డిగూడెంలో రూ.170, గోపాలపురంలో రూ.130కు కొనుగోలు చేశారు:
- ముఖ్యమంత్రి హెచ్చరించిన మరుసటి రోజే ధరలు పడిపోవడం వ్యాపారుల సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.
- “ఏదో ఒక ధరకు మా పంట కొనండి, మమ్మల్ని బతికించండి” అని రైతులు వేడుకోవాల్సిన దుస్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది.
- కొనుగోళ్లలో నో బిడ్లు పెట్టడం, పెద్దఎత్తున బేళ్లను తిరస్కరించడం ద్వారా రైతులను మరింత నష్టపరుస్తున్నారు.
- వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర రావాలనే ఉద్దేశంతో టొబాకో బోర్డు ఏర్పాటైంది. కానీ చంద్రబాబు పాలనలో ఆ లక్ష్యమే పూర్తిగా దెబ్బతింది.
- వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది.
- నిబంధనలు పాటించని కంపెనీలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.
- ఏ కంపెనీ లైసెన్సునూ సస్పెండ్ చేయలేదు. ఒక్క వ్యాపారినీ బ్లాక్లిస్ట్లో పెట్టలేదు.
- ఎంత పంట వేయాలో, ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తామో ముందుగా హామీ ఇచ్చిన లైసెన్స్దారులు ఇప్పుడు తమ బాధ్యతను విస్మరిస్తున్నారు.
- లైసెన్స్ పొందిన వ్యాపారులు హామీ ఇచ్చిన మేరకు రైతులకు నష్టం రాని ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- మార్క్ఫెడ్ను కొనుగోళ్లలోకి తీసుకొచ్చి ప్రభుత్వం రైతుల తరఫున నిలబడుతోందనే బలమైన సంకేతం ఇవ్వాలి.
- వైయస్సార్సీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్క్ఫెడ్ను పొగాకు వేలం ప్లాట్ఫారంపైకి తీసుకొచ్చాం.
- మార్క్ఫెడ్ రంగప్రవేశంతో మార్కెట్లో నిజమైన పోటీ ఏర్పడి, వ్యాపారుల సిండికేట్ విచ్ఛిన్నమైంది.
- ప్రభుత్వం రైతుల తరఫున కొనుగోళ్లకు సిద్ధంగా ఉందనే భయం వ్యాపారుల్లో ఏర్పడడంతో పొగాకు ధరలు పెరిగాయి.
- చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మార్క్ఫెడ్ను కొనుగోళ్లలోకి రానివ్వకుండా అడ్డుకుంటోంది. దీనివల్ల వ్యాపారుల సిండికేట్కు మరింత బలం చేకూరుతోంది.
- వైయస్సార్సీపీ ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా నిలిచింది.
- ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే స్పష్టమైన సంకేతంతో అనంతర కాలంలో పొగాకు ధరలు నిరంతరం పెరిగాయి.
- రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు దాదాపు రూ.3,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేశాం.
- ఐదేళ్లలో పంటల కొనుగోళ్లు, మార్కెట్ జోక్యం కోసం రైతుల తరఫున సుమారు రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం.
- ప్రతి రైతుభరోసా కేంద్రాన్ని వ్యవసాయ ధరల పర్యవేక్షణ కేంద్రంగా మార్చాం.
- ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధరలను ఆర్బీకేల్లో బోర్డులపై ప్రదర్శించాం.
- ధరలు కనీస స్థాయి కంటే తగ్గిన వెంటనే ఆర్బీకే వ్యవసాయ సహాయకుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే వ్యవస్థను తీసుకొచ్చాం.
- సీఎం యాప్—కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్—ద్వారా ధరలను నిరంతరం పర్యవేక్షించాం.
- ప్రతి జిల్లా జాయింట్ కలెక్టర్ను మార్క్ఫెడ్ జాయింట్ ఎండీగా నియమించి, ధర పడిన ప్రాంతంలో వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా వ్యవస్థ ఏర్పాటు చేశాం.
- ప్రభుత్వం వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో పోటీ ఏర్పడి, రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి.
- గతంలో ప్రభుత్వం రైతులకు తోడుగా ఉందనే భరోసా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం తమకు అండగా లేదనే భావన రైతుల్లో నెలకొంది.
- ప్రభుత్వ నిర్లక్ష్యమే దళారులు, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకునే పరిస్థితికి కారణమైంది.
- రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు ముఖంలో చిరునవ్వు ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
- రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడకపోతే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుంది.
Tags: Y.S. Jagan’s meeting with tobacco farmers