ఎన్టీఆర్ ముచ్చట్లు:
తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కలకోట శ్రీనివాసరావు పీజీఆర్ఎస్లో డొంక సమస్యపై అర్జీ సమర్పించగా, తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యకు సంబంధించిన వివరాలను అర్జీదారు, సంబంధిత రైతులు, అధికారులను అడిగి తెలుసుకుని, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ పరిశీలనలో ఏ.కొండూరు తహసీల్దార్, అర్జీదారు, సంబంధిత రైతులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: RDO conducts a field inspection regarding the access road issue.