తిరుపతి ముచ్చట్లు:
విజయనగరానికి చెందిన భక్తుడు శ్రీనివాస సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి సుమారు 56.8 గ్రాముల బరువున్న వజ్రాలతో కూడిన బంగారు హారాన్ని ఆలయ అధికారులకు విరాళంగా సమర్పించారు.
ఈ హారం విలువ సుమారు రూ.12.50 లక్షలు.
ఆలయ అధికారులు దాతకు వేదాశీర్వచనం అందించి, శ్రీ పద్మావతీ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ లు సురేష్, రమేష్, మునిచెంగల్ రాయులు, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Diamond-studded gold necklace donated to Goddess Sri Padmavati at Tiruchanur.