అమెరికా ముచ్చట్లు:
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అట్లూరి ప్రసన్నగా గుర్తింపు
సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మరో వాహనం
ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రసన్న
ఈ ఘటనలో ప్రసన్నతో పాటు మరో యువతి కూడా మృతి
వివరాల ప్రకారం, ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళుతోంది. మార్గమధ్యంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వారి వాహనం ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రసన్నతో పాటు మరో యువతి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న మూడో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రసన్న ఇటీవలే న్యూయార్క్లోని పేస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విధి వక్రించి ప్రమాదం రూపంలో ఆమెను కబళించింది. ప్రసన్న మరణవార్త తెలియడంతో ఆమె స్వగ్రామం మూలపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Tags: Horrific road accident in the US; young woman from AP, Atluri Prasanna, killed.