ఏలూరు జిల్లా ముచ్చట్లు:
జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో ఆస్తి వివాదాల నేపథ్యంలో కరుమూరి దుర్గారెడ్డి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు.
ఆయన సోదరుడి కుమారుడు కరుమూరి శ్రీనివాసరెడ్డి, అనుచరులు కలిసి మారణాయుధాలతో దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపినట్లు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నారు.
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
Tags: Nephew hacks uncle to death over property dispute.