July 8, 2026
Explore
పీఎంఎంఎస్‌వై నిధుల పక్కదారి

పీఎంఎంఎస్‌వై నిధుల పక్కదారి

July 8, 2026 | Andhra Pradesh

ముగ్గురు మత్స్యశాఖ అధికారులపై క్రిమినల్ కేసులకు ప్రభుత్వం ఆదేశం

​గుంటూరుముచ్చట్లు:

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకానికి సంబంధించిన ప్రభుత్వ నిధులను భారీగా పక్కదారి పట్టించి, తీవ్ర ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ముగ్గురు మత్స్యశాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.

పల్నాడు జిల్లాలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రాథమిక విచారణ అనంతరం ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

​ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశం
​ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో ప్రభుత్వం మొత్తం ముగ్గురు (3) అధికారులపై పల్నాడు జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.

కేసు నమోదు కానున్న ఆ అధికారుల వివరాలు:
​శ్రీ ఎస్. సంజీవ రావు – అప్పటి జిల్లా మత్స్యశాఖ అధికారి (DFO / ADF),

పల్నాడు.
​ టి.వి.ఎ. శ్రీనివాస రావు – అప్పటి ఏఐఎఫ్ (మల్టీపర్పస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్), మాచర్ల మరియు ఎఫ్‌డీఓ (ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్), నాగార్జున సాగర్.
​ జి. భాగ్యలత – అప్పటి ఏఐఎఫ్, నరసరావుపేట.
​రూ. 3 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం
​మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె. శాంతి నేతృత్వంలో జరిగిన ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీఎంఎంఎస్‌వై (PMMSY) పథకం కింద విడుదలైన రూ. 307.60 లక్షల (రూ. 3.07 కోట్లు) ప్రభుత్వ నిధులను ఈ అధికారులు దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా రుజువైంది. దీనితో పాటు కేఎల్ రావు (పులిచింతల) రిజర్వాయర్‌లో లైసెన్సుల జారీ ప్రక్రియలో వైఫల్యం చెందడం వల్ల ప్రభుత్వానికి రూ. 2.425 లక్షల ఆదాయ నష్టం వాటిల్లినట్లు విచారణాధికారి నివేదికలో పేర్కొన్నారు.

Tags: Diversion of PMMSY funds