అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నైట్ బీట్ బృందాలు, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను ఫింగర్ ప్రింట్ పరికరాలతో పరిశీలించడంతో పాటు, నిద్రమత్తులో వాహనాలు నడిపే డ్రైవర్లను అప్రమత్తం చేశారు. ప్రధాన కూడళ్లలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఈ తనిఖీలు ప్రతిరోజూ కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Tags: Police intensify surveillance in Annamayya district at midnight