మదనపల్లె ముచ్చట్లు:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును పెంచాలని వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమద్ కోరారు. మదనపల్లి పట్టణంలోని 23వ వార్డులో నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు దరఖాస్తులపై అవగాహన కల్పించారు. డిజిటైజేషన్ ఆలస్యం వల్ల అర్హులు నష్టపోకుండా గడువు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇబ్బందులుంటే అవెన్యూ రోడ్డులోని వార్ రూమ్ను సంప్రదించాలన్నారు.
Tags: SIR process deadline should be extended: Nisar Ahmed