రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట మండలం బాలరాజుపల్లి గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రమాదవశాత్తు గాయపడి కోలుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు కొండూరు రెడ్డయ్య రాజును ఆయన నివాసంలో పరామర్శించారు.
Tags: Chamarthi Jagan Mohan Raju discusses village issues.