June 30, 2026
Explore
మల్లయ్య కొండ లో ఇనుప ఖనిజం దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

మల్లయ్య కొండ లో ఇనుప ఖనిజం దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

June 30, 2026 | Andhra Pradesh

-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతిముచ్చట్లు:

  • ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో ఆ పాపాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల అధికారంలో దాదాపు 20 కోట్ల రూపాయలు మల్లయ్య కొండ అభివృద్ధికి కృషి చేసింది. టిడిపి పాలనలో ఒక్క పైసా అభివృద్ధి ఎందుకు చేయలేదు?.
  • గతంలో కాలిబాట కూడా సరిగ్గా లేని పరిస్థితి నుండి ఆలయ జీర్ణోద్ధరణ చేసి, రోడ్లు వేసి, విద్యుత్ సరఫరా, మంచినీరు, ఇతర సదుపాయాలు అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
  • 2022 లో ఎర్రకొండలో మైనింగ్ కు సంబంధించి కేంద్రం నుండి అనుమతులు వచ్చిన మాట వాస్తవమే
  • అయినా కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకొండలో మైనింగ్ అనుమతులు ఉన్నా కూడా మేము ఆ ప్రక్రియ కొనసాగించలేదు.
  • అనుమతులు వచ్చినా మైనింగ్ చేయకూడదు అని నిర్ణయించాం, పూర్తి గా నిలిపివేశాం.
  • కానీ మేం ఆపేసిన ఎర్రకొండ అనుమతులు చూపించి, ఏకంగా ఆ శివుడు కొలువై ఉన్న సాధు కొండ, శివపురం లో మైనింగ్ కు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది
  • సాధు కొండలో మైనింగ్ గురించి 2004 జనవరి 1 నుండి జియోమైసూర్ సర్వీసెస్ అనే సంస్థ ప్రభుత్వం తో అనేకమార్లు సంప్రదింపులు జరిపింది
  • అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే…
  • ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు మళ్ళీ జియో మైసూర్ సంస్థ అనేక లేఖలు ప్రభుత్వానికి రాసింది
  • కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తంబళ్లపల్లె స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆ ప్రాంతంలో మైనింగ్ జరిగితే ప్రజలతో పాటుగా తాను వ్యతిరేకిస్తాను అని స్వయంగా అప్పటి మైనింగ్ మంత్రి గల్లా అరుణ కుమారి కి చెప్పారు
  • ఈ విషయం నేను చెప్పట్లేదు….. స్వయంగా గల్లా అరుణ కుమారి గారు ఈ అంశాన్ని ఆమె పుస్తకంలో రాసుకున్నారు.
  • 2015 లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్…. అంటే ఖనిజాలు గుర్తించేందుకు లైసెన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే
  • సాధు కొండ, శివపురం టెండర్లు ఇచ్చింది ఈ జనవరిలో, కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది ఈ ఏడాదిలోనే
  • వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిన ఎర్రకొండ కు ఎల్.సి ఇచ్చింది ఈ నెల 23న కాదా? దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి
  • సాధుకొండకు కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 27న టెండర్ పిలిచారు
  • ఏపీఎండీసీ దాఖలు చేసిన టెండర్ కు ప్రిఫర్ బిడ్డర్ కింద 900 హెక్టార్లలో ఈ ఏడాది ఏప్రిల్ 23న ఎల్.సి జారీ ఎలా చేశారు
  • శివపురం లో 626 హెక్టార్లలో మైనింగ్ కోసం 2025 ఫిబ్రవరి 27, సెప్టెంబర్ 4న ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వమే.
  • ఆ సమావేశాల్లో నిర్ణయం మేరకు శివపురం లో మైనింగ్ కు టెండర్ పిలిచి, 2026 మార్చి 30న సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కు ఎల్.సి జారీ చేశారు
  • భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిన ఎర్రకొండ మైనింగ్ ను మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రారంభించింది
  • 2025 మార్చి 10న ఎర్రకొండకు సంబంధించి 300 హెక్టార్లలో మైనింగ్ కు టెండర్లు పిలిచారు
  • ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎల్.సి జారీ చేసింది కూటమి ప్రభుత్వం కాదా ?
  • మైనింగ్ పేరుతో మొత్తం మల్లయ్య కొండను దోచేయాలి అని కూటమి ప్రభుత్వం చూస్తుంది అనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి ?
  • భక్తుల మనోభావాలతో మైనింగ్ అనుమతులు ఉన్నా మేము ముందుకు పోలేదు… ఆ అనుమతులను వాడుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మైనింగ్ కు సిద్ధం అయ్యారు
  • ఇకనైనా వైసీపీ పై తప్పుడు ప్రచారాలు చేయడం మాని, ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నాం
  • ఒకవేళ అక్కడ మైనింగ్ కు యత్నిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది
  • దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మైనింగ్ కు పూనుకుని మాపై విమర్శలు చేస్తుంది
  • తిరుమల 7 కొండలు లానే మల్లయ్య కొండ మూడు కొండలు పవిత్రమైనవి
  • మల్లయ్య కొండ జోలికి వెళితే భక్తులు ఊరుకోరు
  • రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు
  • పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్రం మంత్రి ఉన్నా అక్కడ మామిడికి 17 రూపాయల మద్దతు ధర ఉంది
  • చంద్రబాబు కు రైతులు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు
  • రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడమే జరుగుతుంది

Tags: The alliance government has set in motion the plundering of iron ore at Mallayya Konda.