చౌడేపల్లిముచ్చట్లు:
18 ఏళ్ల వయసు నుండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిద్దామని వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని పొదలపల్లి గ్రామంలో పర్యటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆయన గ్రామాన్ని సందర్శించి, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా మిద్దింటి కిషోర్ మరియు బూత్ లెవెల్ అధికారులు (BLO), బూత్ లెవెల్ ఏజెంట్లతో (BLA) కలిసి ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల జాబితా రూపకల్పన మరియు మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జరగాలని సూచించారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, వివరాలను నమోదు చేసే అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. అర్హత ఉన్న వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేసేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.నూతన ఓటు హక్కు కోసం యువత ముందుకు రావాలన్నారు.రాబోయే ఎన్నికల్లో యువతే కీలకం అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ విజయకుమార్ రెడ్డి ,బి ఎల్ ఏ బాబు, శ్రీనివాసులు ,మరియు గ్రామస్తులు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Let us ensure voting rights for eligible individuals who have attained the age of 18: Middinti Kishore.