పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మూడు కోర్టు విధులను న్యాయవాదులు సోమవారం బహిష్కరించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్కుమార్ మాట్లాడుతూ రాయచోటిలో రాజేష్ అనే న్యాయవాదిపై దాడి జరగడాన్ని ఖండిస్తున్నామన్నారు. న్యాయవాదులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోర్టు విధులు బహిష్కరించామన్నారు.
Tags: Lawyers boycott duties