పల్నాడు ముచ్చట్లు:
సత్తెనపల్లి పట్టణంలోని సుందరయ్య కాలనీ, శాలివాహన నగర్ మధ్య ఉన్న దేవర్లపాడు డొంక రోడ్డు శనివారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి జలమయమైంది. రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి నిల్వల కారణంగా విషపురుగులు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలను కుట్టే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు.
Tags; Rural road waterlogged due to rain; Sattenapalli residents face hardship.