రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రచార కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డా. మధుసూదన వర్మ ప్రారంభించారు. కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, NCC, NSS, కంప్యూటర్ ల్యాబ్లు, జిమ్, లైబ్రరీ మరియు జేకేసీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Tags; Admission campaign launched at Rayachoti Government Degree College.